శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా #SSMB 28 ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. “అతడు “, “ఖలేజా ” మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB 28 ”మూవీ పూజా కార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. ఈ పూజా కార్యక్రమానికి మహేష్ బాబు సతీమణి నమ్రత , హీరోయిన్ పూజాహెగ్డే హాజరు అయ్యారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న “#SSMB 28″మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందనున్న “#SSMB 28 ” మూవీ కి ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో సిద్ధం అయ్యారు. “#SSMB 28 ” మూవీ కై ఇటీవల “కెజిఎఫ్ 2”, “విక్రమ్” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కి ఫైట్ మాస్టర్స్ గా వర్క్ చేసిన అన్బరివు సోదరులతో డైరెక్టర్ త్రివిక్రమ్ చర్చలు జరిపినట్టు సమాచారం. బ్లక్ బస్టర్ “సర్కారు వారి పాట ” మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కనున్న “#SSMB 28 ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: