సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. “పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి, బాలీవుడ్ లో అల్లు అర్జున్ పై క్రేజ్ పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ , తన కుటుంబ సభ్యుల ఫొటోలు , వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ లో 18.5 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ కి అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మరో అద్భుతమైన రికార్డ్ ను క్రియేట్ చేశారు. తాజాగా ట్విట్టర్ లో 7 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను అల్లు అర్జున్ చేరుకున్నారు. తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ 7M, అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: