ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కాంపిటీషన్ లో గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. కొత్త కొత్త టాలెంట్ రోజూ ఇండస్ట్రీకి పరియచమవుతున్న తరుణంలో వరుస అవకాశాలు దక్కించుకోవడం కూడా అంత తేలిక కాదు. హార్డ్ వర్క్ ఉండాలి.. టాలెంట్ ఉండాలి వీటితో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో రాణించగలరు. ఈనేపథ్యంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలానికే క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకొని ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో బిజీ హీరోయిన్ గా వరుస అవకాశాలను దక్కించుకుంటుంది కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కృతిశెట్టి మొదటి సినిమాతోనే తెలుగులో సంచలన విజయం దక్కించుకుంది. ఆసినిమాలో కృతి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఆ సినిమా తరువాత వరుసగా అవకాశాలను అందుకుంటూ ఇప్పుడు బిజీ హీరోయిన్ అయిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం తను నటించిన మాచర్ల నియోజక వర్గం సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఆగష్ట్ 12న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్య క్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతిశెట్టి.. బాలీవుడ్ ఎంట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల తర్వాత నాకు బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్ లు వచ్చాయి.. అయితే నాకు టాలీవుడ్ ఏం కావాలో అది ఇచ్చింది.. అందుకే బాలీవుడ్ వెళ్లాల్సిన అవసరం తనకు లేదనుకున్నాను అని ‘కృతి శెట్టి’ చెప్పుకొచ్చింది. మరి ఇప్పటికైతే బాలీవుడ్ వెళ్లాల్సిన అవసరం రాలేదు.. ఫ్యూచర్ లో వెళుతుందేమో చూద్దాం..
కాగా ఈసినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా కేథరిన్ థెరిసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: