బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి, ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” , “బంగార్రాజు ” మూవీస్ తో కృతి శెట్టి హ్యాట్రిక్ సాధించారు.సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్లనియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.బాలా దర్శకత్వంలో సూర్య హీరో గా తెరకెక్కనున్న తమిళ మూవీ, అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో హీరో ధనుష్ నటించే మూవీ , నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న “#NC 22” మూవీ లో కృతి కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సె ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న కృతిశెట్టి మాట్లాడుతూ .. తన లైఫ్ ను ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తనకే ఆశ్చర్యం వేస్తోందనీ , సినిమాల్లో ఇంత బిజీ అవుతానని తను కలలో కూడా ఊహించలేదనీ , గత జన్మలో కూడా తాను హీరోయిన్ నే అయి ఉంటాననీ , ఎందుకంటే, ఈ జన్మలో తనకు నటన అనేది సహజంగా వచ్చేస్తోందనీ ,ఏ సీన్ అయినా తనకు నేచురల్ గా వచ్చేస్తోందనీ , కాబట్టి ఈ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నాననీ , ఈ విషయంలో తాను అదృష్టవంతురాల్నిఅనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: