“హలో” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కళ్యాణి ప్రియదర్శన్ “చిత్ర లహరి” , “రణరంగం ” మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. తమిళ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కళ్యాణి ప్రస్తుతం రెండు మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “ఫిదా “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి “విరాట పర్వం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ తో టాలీవడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి రెండు తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. ఒక తమిళ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. హీరో నాని “గ్యాంగ్ లీడర్” తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియాంక అరుళ్ మోహన్ “శ్రీకారం “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియాంక ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక ఈవెంట్లో కలిసిన కళ్యాణి , సాయి పల్లవి , కృతిశెట్టి , ప్రియాంక కలసి సెల్ఫీ దిగారు. ప్రియాంకా మోహన్ తన కోస్టార్ల పక్కనే కూర్చొని సెల్ఫీ తీసింది. ఈ స్టిల్ను అందరినీ రూల్ చేయడానికి ఒక్క ఫొటో అంటూ కళ్యాణి ప్రియదర్శన్ ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆ సెల్ఫీ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: