సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈసినిమాకు పరుశురాం దర్శకత్వం వహించారు. ఈసినిమాఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియోన్స్కు బాగా కనెక్ట్ కావడంతో.. బాక్సాఫీసు వద్ద ‘సర్కారు వారి పాట’ సందడి చేస్తోంది. ఇక ఈసినిమా రిలీజ్ అయి ఇప్పటికే వారం రోజులు అయిపోయింది. వారం రోజులు అయినప్పటికీ ఈసినిమా ఇంకా మంచి కలెక్షన్స్ నే రాబడుతుంది. రిలీజ్ అయిన నాలుగు రోజులకే వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ఈ వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 171 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. మరోవైపు ఓవర్సీస్ లో కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఇప్పటికే 2 మిలియన్ మార్క్ ను దాటగా.. వీకెండ్ లోపు 3 మిలియన్ వరకూ చేరవచ్చు అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో సముద్రఖని, నదియా, నాగబాబు, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈసినిమాను నిర్మించారు. థమన్ సంగీతం.. మది సినిమాటోగ్రఫి అందించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: