రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా…అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టి షూటింగ్ ను కూడా శరవేగంగా జరుపుకుంటుంది. క్కా ప్లానింగ్ తో అనుకున్నది అనుకున్నట్లు షూటింగ్ చేసుకుంటోంది. ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని ఈమధ్యనే రెండో షెడ్యూల్ ను కూడా మొదలుపెట్టింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నట్టు చిత్రబృందం తెలుపుతుంది. ఈ షెడ్యూల్ తో దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్మాతలు ఏ.సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ.. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మా సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. అభిమన్యు బద్ది డెబ్యూ డైెరెక్టర్ అయినా పక్కా ప్లానింగ్ తో వేసిన షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ చేస్తున్నారు. తాజాగా గోవాలో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. దీంతో 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇదే స్పీడ్ తో సినిమాను కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
ఇక ఈసినిమాను మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తుండగా.. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు.ఇంకా ఈసినిమాలో రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిషోర్ మరో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా ప్రవీణ్ ఎడిటర్ గా చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: