ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో చిరుతో పాటు చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాను ఎప్పుడు చూద్దామా అని మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చిరు-చరణ్ సినిమా కావడంతో ఇప్పటికే సినిమాపై హైఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఫైనల్ గా ఈనెల 29న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు చిత్రయూనిట్. కొరటాలశివ, చరణ్ ఇప్పటికే ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించనున్నట్టు తెలుస్తుంది. చిత్రయూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ కొరటాల శివ ప్రతిపాదన మేరకు మహేష్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. మరి నిజంగా ఇది ఫ్యాన్స్ కు మెగా సూపర్ ట్రీట్ లాంటిదే.
కాాగా ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే
కనిపించనుంది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: