“ముగమూడి”మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన పూజాహెగ్డే , హీరో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.పూజా హెగ్డే కథానాయికగా నటించిన“ఆచార్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
“F 3” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “కిరిక్ పార్టీ “కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక బ్లాక్ బస్టర్ “ఛలో”మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.దక్షిణాది భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్ననేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక ప్రస్తుతం “”పుష్ప :ది రూల్ “, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ స్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “పుష్ప :ది రైజ్ ” హిందీ డబ్బింగ్ వెర్షన్ తో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక బ్లాక్ బస్టర్ “కబీర్ సింగ్ “మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కనున్న క్రైమ్ డ్రామా “యానిమల్ “హిందీ మూవీ లో రణ్ బీర్ కు జోడీగా ఎంపిక అయ్యారు.
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. 2022 లో “బంగార్రాజు ” మూవీతో కృతిశెట్టి హ్యాట్రిక్ సాధించారు. కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్లనియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.తాజాగా కృతిశెట్టి తమిళంతో పాటు బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బాలా దర్శకత్వంలో సూర్య హీరో గా తెరకెక్కనున్న తమిళ మూవీలో కృతిశెట్టి ఒక కథానాయికగా ఎంపిక అయ్యారు. .స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కనున్న బాలీవుడ్ మూవీ లో కృతిశెట్టి కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.
సూపర్ హిట్ “ఓం శాంతి ఓం “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన దీపికా పడుకొనే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. దీపిక ప్రస్తుతం బాలీవుడ్ మూవీ “పఠాన్” లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతుంది. ఈ మూవీ తో దీపిక టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. టాలీవుడ్ హీరోల మూవీస్ లో నటించాలని దీపికా తన మనసులో మాటను వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ నలుగురు టాప్ హీరోయిన్స్ కర్ణాటక స్టేట్ కు సంబంధించిన వారు కావడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: