పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.“లైగర్” మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన సంగతి తెలిసిందే. “లైగర్” సినిమా నిర్మాణ క్రమంలో కరణ్ జోహార్ తో పూరి, ఛార్మిలకు మంచి అనుబంధం ఏర్పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ , అలియా భట్ జంటగా “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ ” హిందీ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ సెట్స్ కు వెళ్ళిన పూరి జగన్నాథ్ , ఛార్మి లకు కరణ్ జోహార్ తో పాటు రణవీర్ సింగ్ కూడా గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” సెట్స్లో మీ ఎనర్జీ మరియు బాండింగ్ తో మా పై అద్భుతమైన రెస్పాన్స్ చూపించారనీ , రణవీర్ సింగ్. ఇక కరణ్ జోహార్.. మీరు ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడుతున్నారు అంటూ వారి తో ఉన్న ఫొటో ను ఛార్మి సోషల్ మీడియా లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: