పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజా హెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “రాధేశ్యామ్” మూవీ మార్చి 11 , “ఆచార్య “ఏప్రిల్ 29 , “బీస్ట్ ”( తమిళ ) మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం” రాధే శ్యామ్” మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా పూజా హెగ్డే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా పూజా హెగ్డే ఇంటర్వ్యూలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. సెట్స్ లో ప్రభాస్ జోవియల్గా ఉంటారనీ , ఆయనతో షూటింగ్ చాలా ఫన్ గా ఉంటుందనీ , ప్రభాస్కి కొంత సిగ్గు అనీ , ఎన్టీఆర్ హై ఎనర్జిటిక్ పర్సన్ అనీ , ఆయనకు భాషపై కూడా పట్టు ఉంది కనుక ఏదైనా సరే సింగిల్ టేక్లో చేసేస్తారనీ , అల్లు అర్జున్ కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటారనీ కామెంట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: