అమల్ నీరద్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అమల్ నీరద్ స్వీయ దర్శకత్వంలో మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ మలయాళ మూవీ “భీష్మ పర్వం” మార్చి 3వ తేదీ రిలీజ్ కానుంది. నదియా కీలక పాత్ర లో నటించగా ప్రముఖ యాంకర్ , నటి అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తుండగా.. ఆనంద్ సి చంద్రన్ ఛాయాగ్రహణం అందించారు. “భీష్మ పర్వం” మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. డైలాగ్స్, మాసీ అప్పీయరెన్స్ , ఫైట్స్ ట్రైలర్ కే హైలైట్స్ గా నిలిచాయి. మైఖేల్ అనే పవర్ ఫుల్ పాత్రలో మమ్ముట్టి నటించారు. బ్లాక్ డ్రెస్ లో, పొడవైన జుట్టుతో మమ్ముట్టి మేకోవర్ ఆకట్టుకుంటోంది. గతంలో మమ్ముట్టి, అమల్ నీరద్ కాంబినేషన్ లో “బిగ్ బీ” అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరి కాంబోలో ఇప్పుడు ‘భీష్మపర్వం’ చిత్రం రాబోతోంది. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: