హైదరాబాద్ శంషాబాద్ ముచ్చింతల్లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణ లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలలో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు , సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీరామనగరంలో సమతామూర్తితో పాటు, దివ్యాలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రుత్విక్కులు శ్రీరామనగరంలోని సమతామూర్తి ఆలయ విశేషాలను ఆయనకు వివరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో జరుగుతున్న యజ్ఞక్రతువులను వీక్షించారు. తరువాత శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ .. సమతామూర్తిని దర్శించుకోవడం ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందనీ , ఆలయంలో ఉన్నంతసేపు తనువు భక్తితో పులకించిందనీ , సమతామూర్తిని ఎంతచూసినా తనివి తీరలేదనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: