బాలీవుడ్ లో నెపోటిజం గురించి ఎంతో మంది గతంలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా బాలీవుడ్ క్వీన్ కంగనా బాలీవుడ్ నెపోటిజంపై ఎన్నో సార్లు విమర్శించింది. ఇక ఇప్పుడు టాలెంటెడ్ నటి తాప్సీ కూడా బాలీవుడ్ లో ఉన్న నెపోటిజం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తుంది. ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెరకి పరిచయమైంది తాప్సీ. ఇప్పుడు వైవిథ్యమైన కథలను ఎంచుకుంటూ తన సత్తా చాటుతుంది తాప్సీ. తెలుగులో కాస్త సినిమాలు తగ్గినా కూడా బాలీవుడ్ లో మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే తాప్సీ నటించిన లూప్ లపేటా సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తాప్సీ నెపోటిజం గురించి మాట్లాడుతూ.. నేను సినీ రంగంలోకి 2010లో వచ్చాను.. దాదాపు ఒక దశాబ్దం అవుతుంది.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మొదట అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను.. ఆ తరువాత మంచి పాత్రల ద్వారా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నా.. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తున్నా.. అయినప్పటికీ నాకు మంచి రోల్స్ రావట్లేదు. దానికి కారణం నెపోటిజమే కావొచ్చు అని చెప్పుకొచ్చింది. ఎవరైనా నాకోసం మంచి కథ రాసినా కూడా దానికోసం డైరెక్టర్ ను కానీ.. ప్రోడక్షన్ హౌస్ ను కానీ ఒప్పించడం చాలా కష్టం.. కానీ స్టార్ కిడ్స్ కు మాత్రం చాలా ఈజీ అంటూ బాలీవుడ్ లో నెపోటిజం గురించి చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే మరోపక్క ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్టార్ట్ చేసింది తాప్సీ. ‘ఔట్ సైడర్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ని ప్రారంభించింది. అందరికీ సమానంగా అవకాశాలు ఇవ్వాలని తాప్సీ ఈ నిర్మాణసంస్థను ప్రారంభించినట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: