డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. కరోనా వల్ల ఈసినిమాకు చాలా బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా ఈసినిమా షూటింగ్ ఎక్కువ భాగం బొంబైలో చేస్తుండటంతో అక్కడ ఆంక్షలు మరీ ఎక్కువ ఉండటంతో ఇక్కడకు వచ్చేశారు. ఆ తర్వాత మళ్లీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత విదేశాల్లో షూటింగ్ కోసం కొన్ని రోజులు.. మళ్లీ కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఇలా చాలా సార్లు షూటింగ్ ఆగిపోయింది. ఇక ఈసినిమా మళ్లీ తిరిగి షూటింగ్ ను ప్రారంభించింది. నేడు చివరి షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈ విషయాన్ని ఈసినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ఈ షెడ్యూల్ తో ఈసినిమా షూటింగ్ మొత్తం పూర్తవనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Last leg of #LIGER schedule 🙌 pic.twitter.com/S4ud4AGX4M
— Charmme Kaur (@Charmmeofficial) February 4, 2022
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు. 2022, ఆగస్ట్ 25న లైగర్ సినిమా రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: