క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా ద్వారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పాల్గొన్న ఈసినిమా నిర్మాత నీలిమ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. దీనిలో భాగంగానే ఈసినిమాలో విలన్ గా కబీర్ దుహాన్ సింగ్ నటిస్తున్నాడని.. అసుర మహారాజు అనే పాత్రలో నటిస్తున్నాడని తెలిపింది. ఈసినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ లో చాలా కష్టపడ్డాడని.. కిరీటం.. కవచం ఇలా దాదాపు 30 కిలోల బరువు మోశాడని తెలిపింది. ఇంకా ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది. ఇక అల్లు అర్హ కూడా చాలా క్యూట్ గా నటించింది అని తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: