నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో , తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నాని సినీ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “శ్యామ్ సింగరాయ్” చిత్రంలో హీరో నాని ప్రస్తుత కాలంలో ఫిల్మ్ మేకర్ గా., 1970ల కాలం నాటి బెంగాలీ రచయితగా రెండు విభిన్నమైన పాత్రలు , దేవదాసి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.అయితే తాజాగా ఆడియెన్స్ రెస్పాన్స్ ప్రత్యక్షంగా చూసేందుకు హీరోయిన్ సాయి పల్లవి బుర్ఖా వేసుకొని థియేటర్లో సందడి చేశారు. బుధవారం హైదరాబాద్ ముసాపేటలోని శ్రీరాములు థియేటర్కు సాయి పల్లవి బురఖా ధరించి డైరెక్టర్ రాహుల్తో కలిసి “శ్యామ్ సింగరాయ్ “ను వీక్షించారు. బురఖా లో ఉన్న సాయి పల్లవి ని ఎవరూ గుర్తు పట్టలేదు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: