వెంకటేశ్వర సినిమాస్ , కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రంజిత్ దర్శకత్వంలో సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ “మైఖేల్ “తమిళ మూవీ పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ ..”మైఖేల్ ” మూవీ ఎమోషన్స్ తో కూడుకున్న హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ అనీ , తెలుగు , తమిళ , హిందీ భాషలలో చిత్రీకరణకు ప్లాన్ చేశామనీ ,కన్నడ , మలయాళ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ చేస్తామనీ చెప్పారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. “మైఖేల్ ” మూవీలో విలన్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎంపిక అయ్యారు. ఆ విషయాన్ని చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించింది. సందీప్ కిషన్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఇటీవల గౌతమ్ మీనన్ పోలీస్ ఆఫీసర్గా నటించిన ‘కనులు కనులు దోచాయంటే’ చిత్రంతో ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: