2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై టి జె జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన “జై భీమ్” తమిళ మూవీ నవంబర్ 2 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. లాయర్ చంద్రు గా స్టార్ హీరో సూర్య , గిరిజన మహిళ పార్వతి ఇన్ స్పిరేషన్ తో సినతల్లి పాత్రలో లిజో మోల్ జోస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గిరిజనులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తెరకెక్కిన “జై భీమ్” మూవీ అందరి మనసులను కదిలించింది. పోలీసు కస్టడీలో చంపబడిన తన భర్త రాజకన్నుకు న్యాయం చేయమని న్యాయపోరాటం చేసిన గిరిజన మహిళ పార్వతి అమ్మాళ్ ఇప్పటికీ సరైన ఇల్లు లేకుండా చిన్న గుడిసెలో నివసిస్తోంది.నటుడు సూర్య మంగళవారం చెన్నైలో రాజకన్ను భార్య పార్వతిని స్వయంగా కలిసి రూ.15 లక్షల చెక్కును అందజేశారు. తన తరపున రూ.10 లక్షలు, తన చిత్ర నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్ తరపున రూ.5 లక్షలు విరాళంగా అందించి తన ఉదారతను చాటుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: