లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం విక్రమ్ సినిమాతో బిజీగాఉన్న సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా రీసెంట్ గానే కమల్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ తో సినిమాపై అంచనాలు, క్యూరియాసిటీని మరింత పెంచేశాడు. విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్ పలువురు ప్రముఖలు నటిస్తుండగా రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా కమల్ మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ తో కమల్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు పా రంజిత్. రజినీతో కాలా, కబాలి లాంటి సినిమాను తీసిన పా రంజిత్ తో కమల్ సినిమాను లైన్ లో పెట్టాడట. ఇటీవల రంజిత్ కమల్ కు ఓ కథను చెప్పడం.. ఆ కథ కమల్ కు నచ్చడంతో కమల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. మరి దీనిపై త్వరలో ఏమన్నా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
మరోవైపు విక్రమ్ సినిమా తరువాత కమల్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయాలని ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఆ వివాదాలన్నీ క్లియర్ అయిపోవడంతో ఈసినిమాను కూడా త్వరలోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: