బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘ఆదిపురుష్’.
ఇక ఈసినిమా షూటింగ్ దగ్గర నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనుల వరకూ ఓం రౌత్ అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే చాలా స్పీడ్ గా షూటింగ్ ను కానిచ్చేస్తున్నాడు. నిజానికి ఈసినిమా కరోనా టైమ్ లోనే సెట్స్ పైకి వెళ్లింది. ఆదిలోనే ఎన్నో ఇబ్బందులు వచ్చినా.. షూటింగ్ కు ఎన్ని ఇబ్బందులు ఉన్నా చాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ ను జరిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న కృతి సనన్.. అలాగే సైఫ్ అలీఖాన్ తమ పాత్రల షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఇక ప్రభాస్ కూడా త్వరలో షూటింగ్ ను పూర్తి చేసుకోనున్నాడు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉంది. దీంతో ఎలాగైనా నవంబర్ కల్లా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నాడట ఓం రౌత్. ఎందుకంటే ఈసినిమా త్రీడీ టెక్నాలజీతో రూపొందుతున్న నేపథ్యంలో షూటింగ్ కంటే కూడా గ్రాఫిక్స్ కు ఎక్కువ టైమ్ పడుతుంది. వచ్చే ఏడాది ఆగష్ట్ లో ఈసినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈనేపథ్యంలో దాదాపు 9నెలలు గ్రాఫిక్స్ కే టైమ్ పడుతుంది. దీంతో షూటింగ్ ను త్వరగా పూర్తి చేసుకొని ఎక్కువగా గ్రాఫిక్స్ పై దృష్టిపెట్టనున్నాడట ఓం రౌత్. పోస్ట్ ప్రొడక్షన్స్ తో పాటు మరోవైపు ప్రమోషన్స్ ను కూడా పార్లల్ గా చేయడానికి ప్లాన్ చేస్తునట్టు తెలుస్తుంది.
కాగా మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. ఆగస్ట్ 11,2022న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























