సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ప్లే అందించడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ రికార్డ్ ను క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమా పై భారీగా అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉందన్న సంగతి తెలిసిందే. ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుండగా కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాలో రానా సరసన మొదట ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత ఐశ్వర్య రాజేష్ తప్పుకోగా ఆ ప్లేస్ లో సంయుక్త మీనన్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ విషయాన్ని కన్ఫామ్ చేసింది చిత్రయూనిట్. తన పోస్టర్ ను పోస్ట్ చేసి టీమ్ లోకి వెల్ కమ్ చెప్పారు.
ఈసినిమాలో పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ కనిపించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వస్తున్నవస్తున్న ఈసినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు రీసెంట్ గా ఈసినిమా రిలీజ్ పై కూడా పలు రూమర్లు వచ్చాయి. పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు బరిలో ఉన్నందున సంక్రాంతి నుండి వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు రాగా.. దానిపై మేకర్స్ స్పందించి అలాంటిది ఏం లేదని.. ఖచ్చితంగా చెప్పిన తేదీకే (జనవరి 12) సినిమా రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: