సూపర్ హిట్ “ఉయ్యాల జంపాల” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాజ్ తరుణ్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం “స్టాండ్ అప్ రాహుల్”, “అనుభవించు రాజా “మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీబ్యానర్ పై సి.హెచ్. సుధీర్ రాజు దర్శకత్వంలో రాజ్ తరుణ్, సందీప్ మాధవ్, సిమ్రత్ కౌర్, సంపద హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మినీ మల్టీస్టారర్ “మాస్ మహారాజు”మూవీ పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో జరిగాయి. తొలి ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్లపై దర్శకుడు వీరశంకర్ క్లాప్ నివ్వగా, జెమిని కిరణ్ స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత సి. కళ్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు సి.హెచ్. సుధీర్ రాజు మాట్లాడుతూ.. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న “మాస్ మహారాజు”మూవీ అందరినీ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పారు. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. దర్శకుడు సుధీర్ ఈ కథ చెప్పగానే తాను చాలా ఎగ్జైట్ అయ్యాననీ , ఈ మూవీ లో సందీప్ కూడా నటిస్తున్నారని చెప్పగానే సినిమా చాలా బాగుంటుందని సినిమాపై నమ్మకం వచ్చిందనీ చెప్పారు. హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. ‘‘వంగవీటి”, “జార్జిరెడ్డి” మూవీస్ తరువాత మంచి పవర్ ఫుల్ కథ చెప్పిన డైరెక్టర్ సి.హెచ్. సుధీర్ రాజుగారికి ధన్యవాదాలనీ , ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉందనీ చెప్పారు. హీరోయిన్లు సిమ్రత్ కౌర్, సంపద మాట్లాడుతూ..ఈ సినిమాలో మాకు చాలా మంచి పాత్రలు ఇచ్చారనీ, ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు అనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: