మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. హీరోయిన్ రష్మిక ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప “మూవీ లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో నటిస్తుండగా, ఫాహద్ భన్వర్ సింగ్ పాత్ర లో నటిస్తున్నారు. వీరిద్దరి మధ్యన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ యాక్షన్ సీన్స్ “పుష్ప “మూవీ హైలైట్ కానున్నాయి. చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేస్తూ, రిలీజ్ డేట్ ను యధావిధి గా ఉంచింది. అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న “పుష్ప “మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: