జీ స్టూడియోస్ సమర్పణలో జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “ప్రస్థానం”మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , “వరల్డ్ ఫేమస్ లవర్”, “టక్ జగదీష్” మూవీస్ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్ “మూవీ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1 వ తేదీ న రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.”రిపబ్లిక్ ” మూవీ విడుదల సందర్భంగా ఐశ్వర్య రాజేష్ మీడియా తో సమావేశమయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ .. “రిపబ్లిక్” పక్కా కమర్షియల్ చిత్రం కాదనీ , .వాస్తవ సంఘటల్ని ఆధారంగా తీసుకుని దేవ కట్టా తనదైన మార్క్ చూపించారనీ , అతి తక్కువ సమయంలో తన పాత్రకి సంబంధించిన చిత్రీకరణ, డబ్బింగ్ పూర్తయిందనీ , సాయిధరమ్ తేజ్ మంచి నటుడనీ , కోర్టు నేపథ్యంలో పది నిమిషాలు సాగే సన్నివేశాన్ని సింగిల్ టేక్లో పూర్తి చేశాడనీ, తమిళంలో పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్నాననీ , తెలుగు సినిమా అవకాశాలు వస్తున్నాయి. పాత్ర నిడివి తక్కువైనా సరే నటనకి ప్రాధాన్యం ఉన్న కథల్నే ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాననీ , సినిమా ఫలితాన్ని పక్కనపెడితే తాను పోషించిన పాత్ర అందరికీ చేరువవ్వాలనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: