ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన”కొండపొలం ” మూవీ అక్టోబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి నవల “కొండపొలం” ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ లో సాయి చంద్ , కోట , నాజర్ , అన్నపూర్ణ , హేమ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా రూపొందిన ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్ కటారు రవీంద్ర యాదవ్, రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైష్ణవ్ తేజ్, రకుల్ పాత్రలను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ కు అద్బుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. “కొండపొలం” మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది. తాజాగా చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. రకుల్ లంగావోణిలో చెట్టుపై హొయలు పోతూ నవ్వుతూ కనిపిస్తుండగా, రెడ్ టీ షర్ట్ లో ఉన్న వైష్ణవ్ తేజ్ ఆమెను ఓరగా చూస్తున్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ “ఉప్పెన” మూవీ తరువాత వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన “కొండపొలం” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: