కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ పలు విధాలా నష్టపోయిన విషయం తెలిసిందే. తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపైన, అలాగే ఆంధ్రా లో టిక్కెట్ రేట్ పెంపుదల విషయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి ని ఆహ్వానించిన నేపథ్యంలో చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్, నాగార్జున, అల్లు అరవింద్, సురేశ్బాబు, దిల్ రాజు, కె.ఎస్.రామారావు, దామోదర ప్రసాద్, సుప్రియ, సునీల్ నారంగ్, స్రవంతి రవికిశోర్, సి.కల్యాణ్, ఎన్వీ ప్రసాద్, కొరటాల శివ, వి.వి.వినాయక్, జెమినీ కిరణ్, భోగవల్లి బాబీ, విక్కీ, వంశీ తదితరులు పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాసిన అన్ని అంశాల గురించి ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా టిక్కెట్ రేట్ల విషయం , చిన్న సినిమాల మనుగడ కోసం ఐదో షో అనుమతి విషయాన్ని చర్చించాలనీ , ఈ సమస్యలన్నిటినీ త్వరగా పరిష్కరించాలని కోరాలనీ నిర్ణయించారు. చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల్లో ఎదురవుతున్న సమస్యల గురించి, వాటి పరిష్కారం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: