కరోనా వల్ల హీరోలు తమ బర్త్ డే లను సెలబ్రేషన్స్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజును వేడుకలను జరిపే అవకాశం లేకుండా పోయింది. లేకపోతే ఫ్యాన్స్ చేసే హడావుడి మాములుగా ఉండదు. ఇక మరో మూడు రోజుల్లో మహేష్ బాబు బర్త్డే వస్తున్న సంగతి తెలిసిందే కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి ఆనందపడాల్సిందే కానీ బహిరంగ కార్యక్రమాలు చేయలేని పరిస్థితి. ఇక తన పుట్టిన రోజుకు మహేష్ ఫ్యాన్స్ కు ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. అదేంటంటే..తన బర్త్ డే సందర్భంగా తన అభిమానులను మొక్కలు నాటాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాపై ఉన్న ప్రేమ, మీరు చేసే పనులు నన్నింకా ప్రేరేపిస్తున్నాయి. ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకంగా నా బర్త్ డే వేడుక జరగాలని కోరుకుంటున్నా. నా పుట్టిన రోజున ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని.. అప్పుడు నేను కూడా చూస్తా” అని ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులను కోరారు మహేష్ బాబు. మరి మహేష్ చెప్పిన తరువాత అభిమానులు ఊరుకుంటారా.. చూద్దాం ఆరోజు సోషల్ మీడియా పోస్ట్ లతో ఎలా నిండిపోతుందో..
View this post on Instagram
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: