తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస పెట్టి సినిమాలను చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే జగమే తంత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మాళవికా మోహనన్ హీరోయిన్ గా ఈసినిమాలో నటించనుండగా.. స్మృతి వెంకట్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు మరో సినిమా కూడా చేస్తున్నాడు ధనుష్. మిత్రన్ జవహర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నిత్యా మీనన్, రాశి ఖన్నా, ప్రియా. బి శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నట్టు ప్రకటించారో లేదో తాజాగా టైటిల్ ను కూడా ప్రకటించారు చిత్రయూనిట్. ఈసినిమాకు తిరుచిత్రంబలం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
#D44 is #Thiruchitrambalam@dhanushkraja @anirudhofficial #MithranJawahar @prakashraaj #Bharathiraja @MenenNithya @RaashiiKhanna_ @priya_Bshankar pic.twitter.com/wYVpyBx9Tu
— Sun Pictures (@sunpictures) August 5, 2021
కాగా ఇంకా ఈసినిమాలో భారతీరాజా, నటుడు ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: