కిషోర్ దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. హైద్రాబాద్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద చెరుకూరి సుధాకర్ నిర్మిస్తుండగా.. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ అయి సినిమాపై ఆసక్తిని పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో మరో ముగ్గురు సీనియర్ నటీమణులు నటిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎవరో కాదు.రాధికా శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్బూ. తాజాగా రాధికా శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్బూ ముగ్గురు నటీమణులు కూడా షూటింగ్ లో జాయిన్ అవ్వగా ఆసినిమా గురించి ఖుష్బూ తన ట్విట్టర్లో తెలిపారు. వీళ్ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసినిమాకు వీరు ఖచ్చితంగా ప్లస్అవుతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
— Sharwanand (@ImSharwanand) August 1, 2021
ఇంకా ఈసినిమాలో వెన్నెల కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్సీఎమ్ రాజు తదితరులు నటిస్తున్నారు.జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకు సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో శర్వానంద్ ఎంత పెద్ద సక్సెస్ అందుకుంటాడో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: