విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడింది. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు ‘గూఢచారి’ సీక్వెల్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి ఈసినిమా మేజర్ కంటే ముందే స్టార్ట్ అవ్వాలి కానీ కాలేదు. అయితే గూఢచారి 2 లేట్ అవ్వడానికి మాత్రం తనే కారణమంటున్నాడు అడివి శేష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడివి శేష్ దీని గురించి మాట్లాడుతూ… గూఢచారి సినిమా తరువాత వెంటనే దీని సీక్వెల్ స్టార్ట్ చేయాలి కానీ అప్పుడు కొద్దిరోజులు గ్యాప్ తీసుకుందామని గ్యాప్ ఇచ్చాను. ఆ తరువాత వేరే ప్రాజెక్టులు రావడం.. దాని తరువాత మేజర్ స్టోరీ రావడంతో ఈసినిమా కాస్త లేట్ అయింది. మేజర్ షూటింగ్ అయిపోయిన వెంటనే ఈసినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టి వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళతానని చెప్పాడు.
వీటితో పాటు శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 2 చేస్తున్నాడు. హీరోయిన్స్గా మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ నటిస్తున్నారు. హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నే ఈసినిమా నిర్మిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: