డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఫ్రీడమ్ ఫైటర్స్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్ , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా పరిస్థితులు సాధారణ స్థితి కి చేరుతూ ఉండడం తో “రౌద్రం రణం రుధిరం “మూవీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. హైదరాబాద్లోని ఒక స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో కీలక సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. రెండు రోజుల క్రితమే రామ్చరణ్ సెట్స్లో అడుగుపెట్టగా బుధవారం నుంచి ఎన్టీఆర్ షూటింగ్లో భాగమయ్యారు. తాజా షెడ్యూల్లో ఎన్టీఆర్, రామ్చరణ్లపై కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటను తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేశారు. త్వరలోనే అలియా భట్ కూడా సెట్స్ లో జాయిన్ కానున్నారు. జూలై నెలాఖరు వరకు షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్లో “రౌద్రం రణం రుధిరం ” మూవీని విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేశారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: