హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. కార్తీక్ విఘ్నేష్ దర్శకత్వంలో ‘జంగిల్’ అనే సినిమా చేస్తున్నాడు. వేదిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ బ్యానర్స్పై మహేష్ గోవిందరాజ్, అర్చనా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు’. వీటితో పాటు అహ నా పెళ్ళంట, పూలరంగడు వంటి సూపర్హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రంతో సినిమా చేస్తున్నాడు. విజన్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ పతాకాలపై నాగం తిరుపతి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాతలుగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు. నాటకం ఫేమ్ కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం కానుంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
#AadiSaiKumar Next flick Under #KalyanjiGogana ‘s Directorial
More updates will revel soon
🌟ing #AadiSaiKumar
🎬 : @kalyankumarraja
💰 : #NagamTirupathiReddy
Ex – Producer : @ThirmalYalla
🎵 : @ImSaiKartheek pic.twitter.com/y5EYkq3aZN— BARaju’s Team (@baraju_SuperHit) June 18, 2021
కాగా ఈసినిమాలో సునీల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా… బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోయే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను కొద్దిరోజుల్లో తెలియజేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: