బెల్లీ, కథక్ డ్యాన్సర్ అయిన ఫరియా అబ్దుల్లా బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫరియా అబ్దుల్లా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక ఇంటర్వ్యూ లో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ .. “జాతిరత్నాలు ” మూవీ తో తెలుగు నేర్చుకున్నాననీ , నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయాలనేది తన కోరిక అనీ , తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ ఏ భాషా సినిమాల్లోనైనా నటించడానికి సిద్ధమనీ ,ఏదో ఒకరోజు డైరెక్షన్ చేస్తాననీ ఫరియా చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫరియా ఇప్పుడు టాలీవుడ్ లో ఒక మంచి అఫర్ అందుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూపొందిన “ఢీ ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ “ఢీ ” మూవీ కి సీక్వెల్ తెరకెక్కనుంది. ఆ సీక్వెల్ లో ఫరియా కథానాయికగా ఎంపిక అయ్యారు. “ఢీ ” మూవీ సీక్వెల్ కు ఫరియా కథానాయికగా పర్ ఫెక్ట్ ఛాయిస్ అని హీరో విష్ణు మంచు భావిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: