రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ కరోనా వల్ల ఇప్పటివరకూ రిలీజ్ కాలేకపోయింది . ఇంకా ఓపదిరోజుల షూటింగ్ వరకూ పెండింగ్ లో ఉంది. ఈగ్యాప్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈరెండు సినిమాల షూటింగ్ లను పార్లర్ చేస్తున్నాడు. అయితే ఈసినిమా షూటింగ్ లకు కూడా బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మళ్లీ షూటింగ్ లకు హీరోలందరూ సిద్దమవుతున్నారు. దీనిలో భాగంగానే ప్రభాస్ కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రభాస్ త్వరలో షూటింగ్ ను మొదలుపెట్టాలని సలార్ టీంకు సూచించాడట. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్లో సలార్ నెక్ట్స్ షెడ్యూల్ చేపట్టనున్నారట. ఈ షెడ్యూల్ లో లీడ్ యాక్టర్లు పాల్గొననున్నారు. జులై రెండో వారంలో చిత్రీకరణ షురూ కానున్నట్టు టాక్. సెప్టెంబర్ వరకు మేజర్ పార్టు షూట్ పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట. ఆ తర్వాత ఆదిపురుష్ టీంతో జాయిన్ కానున్నాడు.
కాగా బొగ్గు నేపథ్యంలో ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామిని ప్రభాస్ కు విలన్గా చేస్తున్నాడు.
సలార్ను 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: