కరోనా ఫస్ట్ వేవ్ తో చిత్ర పరిశ్రమ పలు నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. సినీ కార్మికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 9 నెలల తరువాత షూటింగ్స్ సజావుగా జరుగుతున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో తిరిగి చిత్ర పరిశ్రమ గడ్డు సమస్యను ఎదుర్కొంటుంది. షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి సినీ సెలబ్రిటీస్ తో పాటు సినీ కార్మికులు ఇళ్ళకే పరిమితం అయ్యారు.
పలు మూవీస్ విడుదల వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కరోనా క్లిష్ట పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొంటూ ఉండడం తో దర్శక , నిర్మాతలు షూటింగ్స్ కై సన్నాహాలు చేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ లో ఈ నెలలో షూటింగ్స్ ప్రారంభం అవుతుండగా టాలీవుడ్ లో జూలై నెల నుండి షూటింగ్స్ ప్రారంభంకానున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య ” మూవీ కి 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న “రాధేశ్యామ్ “మూవీ కి 10 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “సర్కారు వారి పాట “ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని , రెండవ షెడ్యూల్ ప్రారంభించిన వెంటనే కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ నిలిచిపోయింది. రాహుల్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్ సుమారు 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ తో పాటు పలుచిన్న చిత్రాలు జూలై నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: