ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమా రీమేక్, దానితో పాటు క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈరెండు సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి.ఇక ఈసినిమా తరువాత హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు. ఇక ఇటీవలే ఈసినిమా గురించి పలు వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటికి చిత్రయూనిట్ కూడాక్లారిటీ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే తో పాటు పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మాలయాళ బ్యూటీ మానస రాధాకృష్ణన్ పేరు కూడా వినిపించింది. గతకొంతకాలంగా ఈవార్తలు హల్ చల్ చేస్తుండటంతో ఈ వార్తలపై స్పందించిన మానస రాధా కృష్ణన్ క్లారిటీ ఇచ్చింది. “నాకు పవన్ కల్యాణ్ గారు అంటే చాలా ఇష్టం .. కానీ ఆయన సినిమాలో నేను చేయడం లేదు” అని ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇంతవరకూ 10 మలయాళ చిత్రాలలో నటించిన మానస రాధాకృష్ణన్ ప్రస్తుతం మలయాళం తమిళ సినిమాల్లో నటిస్తోంది.
కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మరి చిత్రయూనిటే ఏ విషయమైనా అధికారికంగా వచ్చేంత వరకూ ఆగాలని చెప్పింది. మరి హీరోయిన్ ఎవరో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.’గబ్బర్ సింగ్’ బ్లాక్బస్టర్ మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. మరి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: