థియేటర్స్ లేకపోవడంతో సినిమా రీలజ్ లు లేవు… ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో కొత్త సినిమాల నుండి అప్ డేట్స్ కూడా కరువయ్యాయి. దీంతో ఈమధ్య గాసిప్స్ ఎక్కువయ్యాయి.. రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తుంది. దీనితో మేకర్స్ వాటిపై స్పందించి క్లారిటీ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు పరిస్థితులు కాస్త అదుపులోకి వస్తుండటంతో ఒక్కో సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు చిత్ర బృందాలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. దీనితో ఈవార్తలపై స్పందించిన చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఒక్కసారి సినిమా షూటింగ్ ప్రారంభమైతే ప్రతి అప్ డేట్ మేమే ఇస్తాం.. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కోవిడ్తో జాగ్రత్తగా ఉండండి..అప్డేట్ కోసం వేచి ఉండాలని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The excitement and anticipation for #SarkaruVaariPaata is in the air! All our upcoming updates will be worth the wait. Until then, Stay safe & Stay healthy. pic.twitter.com/26PH3ENFU0
— Mythri Movie Makers (@MythriOfficial) June 11, 2021
కాగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో మహేష్ హీరోగా నటిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే దుబాయ్ లో కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోగా.. ఈ సినిమా రెండవ షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభం అయి కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. కరోనా ఉదృతి తగ్గితే త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సర్కారు వారి పాట సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: