అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 రిలీజ్ అయిపోయింది. అమెజాన్ ప్రైమ్ లో ఈసిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మొదటి సీజన్ కు ఎంత మంచి టాక్ వచ్చిందో అంత కంటే ఎక్కువ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది సీజన్ 2. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పలు వివాదాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈసిరీస్ లో కీలక పాత్రలో నటిస్తున్నసమంత పై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేశారు. ఇక రిలీజ్ వరకూ సైలెంట్ గా ఉన్న సమంత.. సిరీస్ రిలీజ్ తో తన మీద వస్తున్న ఆరోపణలకు సమాధానమిచ్చింది అంటున్నారు అందరూ. ఎల్టీటీఈ సభ్యురాలు రాజీ పాత్రలో మనోజ్ భాజ్ పాయ్ పాత్రకు ధీటుగా సమంత చేసిందన్న ప్రశంసలు దక్కుతున్నాయి. తన నటనతో పాటు డైలాగ్ డెలివరీ, ఆ పాత్ర కోసం సమంత ఫిట్ నెస్, డీ గ్లామర్ లుక్లో నటిస్తూ వావ్ అనిపించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా తన పాత్రపై కూడా స్పందిస్తూ భావోద్వేగంతో ఒక లేఖను పోస్ట్ చేసింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 పై వచ్చిన అన్ని కామెంట్స్, రివ్యూలు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని తెలిపింది. ఈలం యుద్ధంలో మహిళల పాత్ర కూడా గొప్పదని.. ఈలం యుద్దంలో లక్షల మంది తమ జీవనోపాధిని, ఇళ్లను కోల్పోయారు. రాజీ కథ, కల్పితమైనప్పటికీ, అసమాన యుద్ధం కారణంగా మరణించినవారికి రాజీ పాత్ర ఓ నివాళి.. అంటూ శ్రీలంకలో తమిళులపై జరిగిన దాడి గురించి భావోద్వేగం చెందారు.
View this post on Instagram
ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తమిళంలో కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలంలో కూడా నటిస్తున్నారు. కరోనా కొంత తగ్గిన తర్వాత షూటింగ్ మొదలుకానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: