నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా అల్లు అర్జున్ తన ఇంటి వద్ద మొక్క నాటి అందరూ నాటాలని పిలుపునిచ్చాడు. తాను మొక్క నాటి ఆ ఫొటోను షేర్ చేసి, అందరూ మొక్కలు నాటి తనలాగే చేయాలని పిలుపునిచ్చాడు. అంతేకాదు.. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరిన్ని మొక్కలు నాటాలని.. ఎకో ఫ్రెండ్లీ అలవాట్లు అలవరుచుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం. మన భవిష్యత్తు తరాల కోసం మన భూమిని పచ్చదనానికి చిరునామాగా మార్చుదాం. ప్రతి ఒక్కరూ ఈ చర్యను తీసుకోవాలని కోరుతున్నాను. మొక్కలు నాటి షేర్ చేయండి.. వాటిల్లో కొన్నింటిని నేను రీషేర్ చేస్తాను. భూమిని రక్షించుకునేందుకు మనందరం కలిసి పని చేద్దాం’ అని బన్నీ తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కాగా ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లుఅర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్గా కనిపించనుండగా, ఆయనకు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేసే ప్లాన్ ఉన్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ ను ఈ ఏడాదిలో రెండో పార్ట్ ను వచ్చే ఏడాది రిలీజ్ చేద్దామనుకుంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: