పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం “థ్యాంక్ యు”, “పక్కా కమర్షియల్ “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. 5 తమిళ , ఒక మలయాళ మూవీ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో షూటింగ్స్ నిలిచి పోయినా ఇటలీ లో జరిగిన “థ్యాంక్ యు” మూవీ షూటింగ్ లో రాశీఖన్నా పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ తో సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ, విదేశాలలో షూటింగ్స్ తో బిజీగా ఉండే సినీతారలు ఇళ్ళకే పరిమితం అయ్యారు. కరోనా సెకండ్ వేవ్, వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనల కారణంగా ప్రజలందరూ ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా విహరించిన రోజులు గుర్తుకొస్తున్నాయి అంటున్నారు రాశీఖన్నా. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రాశీఖన్నా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మనం ట్రావెలింగ్ మిస్ అయినప్పుడు, కోపం వచ్చినట్టు అనిపిస్తుంది కదా! మళ్ళీ ఆ రోజుల్లోకి తీసుకు వెళ్ళండి అంటూ రాశీఖన్నా తన ఫొటో ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: