రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో తెలుగులో వచ్చిన ఛత్రపతి సినిమాఏ రేంజే లో హిట్ అయిందో తెలుసు కదా. 2005లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించి స్టన్నింగ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈసినిమాతో ప్రభాస్ కు మాస్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఈసినిమా హిందీలో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే కదా. ఇందులో అల్లుడు శ్రీను ఫేం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్నాడు. ఈసినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగు ఓరిజినల్ స్క్రిప్ట్ అందించిన విజయేంద్ర ప్రసాదే ఇప్పుడు హిందీ రీమేక్ కు కూడా కథను అందిస్తుండగా.. వి.వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ను ఏప్రిల్ 22న మొదలు పెట్టాలనుకున్నారు. ఇందుకోసం 3 కోట్ల భారీ బడ్జెట్తో ఆరు ఏకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ సునీల్బాబు ఓ విలేజ్ సెట్ను ఏర్పాటు చేశారు. ‘రంగస్థలం’ విలేజ్ సెట్ను కూడా అప్పట్లో ఇదే లొకేషన్లో క్రియేట్ చేశారు. దురదృష్టవశాత్తు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు, లాక్డౌన్ వంటి కారణాలతో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ షూటింగ్ను అనుకున్న సమ యానికి ప్రారంభించలేకపోయారు. ఈ లోపు 3కోట్ల రూపాయలతో వేసిన సెట్ ఇటీవల హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాల తాకిడికి తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఈ సెట్ను పునరుద్దరించే పనిలో పడ్డారు ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు అండ్ కో. ఈ సెట్ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించనున్నారు మేకర్స్.
కాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ పతాకంపై డా. జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరికొత్త అవతారంలో కనిపించ నున్నారు. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: