మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో అఖండ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. దాాదాపు చాలా వరకూ షూటింగ్ పూర్తయింది. ఈకరోనా లేకపోతే మరో రెండు రోజుల్లో రిలీజ్ అవ్వాలి. ఇక ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్గా చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా మే 28న నందమూరి తారక రామారావు జయంతి. ఇదే రోజు అఖండ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ అది పోస్ట్ పోన్ అయింది. ఇక ఈసందర్భంగా బాలయ్య కొత్త సినిమాల నుండి ఏదో ఒక అప్ డేట్ అయితే ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే తాజాగా తన నిర్మాణ సంస్థ ఎన్బీకే ఫిల్మ్స్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. అందులో ఎన్టీఆర్ ఫొటోను ఉంచడంతో పాటు రేపు ఉదయం 8.45 గంటలకు ఓ చిన్న సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అని ప్రకటించారు. దీంతో అది ఏమై ఉంటుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా అఖండ సినిమా తరువాత బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రవితేజతో చేసిన ‘క్రాక్’ మాదిరిగానే ఈ సినిమాను కూడా నిజ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాడు. ఇందుకోసం లైబ్రెరీలకు వెళ్లి మరీ ఏళ్ల నాటి చరిత్రను తిరగేస్తున్నాడు. ఇక సినిమా ఇంకా మొదలుకాలేదు.. అప్పుడే ఈసినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: