2020 సంవత్సరం లో కరోనా మహమ్మారి కారణంగా 9 నెలల పాటు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తో ప్రజలకు భారీగా ధన , ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో నని ప్రజలు భయాందోళన కు గురి అవుతున్నారు. సినీ సెలబ్రిటీస్ కరోనా జాగ్రత్తలతో ప్రజలకు సూచనలను ఇస్తున్నారు. కరోనా సెకండ్వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందనీ , ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలనీ మెగా స్టార్ చిరంజీవి వీడియో సందేశం ద్వారా కోరారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. ఎంతోమంది వైరస్ బాడిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి వల్ల ఆత్మీయుల్ని కోల్పోతున్నామంటే గుండె తరుక్కుపోతోంది. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలలో లాక్డౌన్ విధించారు. కనీసం ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండండి. ఇళ్ళకే పరిమితం అవ్వండి. అత్యవసరమై బయటకు వచ్చినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించండి. వీలైతే డబుల్ మాస్క్ ధరించండి. అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వచ్చినా ఆందోళనకు గురికావొద్దు. భయమే మనల్ని ముందుగా చంపేస్తోంది. పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఐసోలేషన్కి వెళ్ళండి. కరోనా నుంచి కోలుకున్న తరువాత నెల రోజులలో యాంటీ బాడీస్ తయారవుతాయి. ప్లాస్మాదానం చేస్తే ఒక్కొక్కరు ఇద్దరిని కాపాడిన వారవుతారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండండి’ అని చిరంజీవి ప్రజలను కోరారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: