పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “రాధేశ్యామ్ “, “సలార్ “, “ఆదిపురుష్ ” మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ మూవీస్ అన్నీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. కరోనా కారణంగా ప్రభాస్ హీరోగా రూపొందుతున్న మూవీస్ అన్నీ హైదరాబాద్ సెట్స్ లోనే చిత్రీకరణ జరపాలని దర్శక , నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 500 కోట్ల బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ లో కీలక సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ తో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు”ఆదిపురుష్ “మూవీ కై రామోజీ ఫిల్మ్ సిటీ లో గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ సెట్ ను రూపొందించి 90 రోజులు షూటింగ్ జరపడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. దాదాపు 150 కోట్లు వి ఎఫ్ ఎక్స్ కై ఖర్చు కానున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: