దేశంలో కరోనా విలయతాండవం ఆడుతుంది . నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతుండటం, వేలల్లో మరణాలు సంభవించడం ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ పాటిస్తూ కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ మహమ్మారి వైరస్ వ్యాప్తి కొనసాగుతూ జనాన్ని బలి తీసుకుంటోంది. ఫస్ట్ వేవ్తో పోల్చితే సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉంది. సెకండ్ వేవ్ విజృంభణ తో హాస్పిటల్స్లో బెడ్స్, ఆక్సీజన్ దొరకక అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెకండ్ వేవ్ కే పరిస్థితి ఘోరంగా ఉంటే , ఇక థర్డ్ వేవ్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో అనే ఆలోచనతో కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకున్న సోనూ సూద్ ఆక్సీజన్ ప్లాంట్లను నెలకొల్పాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సీజన్ ప్లాంట్లను నెలకొల్పాలని సోనూ సూద్ అనుకుంటున్నట్టు సమాచారం. ఫ్రాన్స్ నుంచి 10 రోజుల్లో ఆక్సీజన్ ప్లాంట్ రాబోతున్నట్టు , అలాగే ఇంకొన్ని దేశాల నుంచి ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా సోనూ సూద్ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: