తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా కరోనా కారణం తో విడుదల వాయిదా పడింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం తో ఆసుపత్రిల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ సీలిండర్లు దొరక్క మరణించే వారి సంఖ్య అధికమవుతున్న విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియా ద్వారా తమవంతు సాయం అందిస్తున్నారు . ప్రజలకు ధైర్యం చెబుతూ వారిని అప్రమత్తం చేస్తున్నారు.స్టార్ హీరోయిన్ తమన్నా కూడా తాజాగా ఒక పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా మహమ్మారి వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, ధైర్యాన్ని కోల్పోయే సమయం కాదిదనీ , పాజిటివ్ దృక్పథంతో ఉండడం అవసరమనీ , నమ్మకంతో పోరాడాలనీ , ఇతరులకు తోడ్పాటు అందించాలనీ , ముఖ్యంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనీ,మనమంతా కలసి కరోనా మహమ్మారి తో పోరాడుదామనీ తమన్నా ప్రజలకు పిలుపునిచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: