జీతూజోసఫ్ దర్శకత్వంలో మోహన్లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈసినిమా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో రీమేక్ చేయగా అన్ని భాషల్లోమంచి విజయం దక్కించుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” కూడా ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు తెలుగులో కూడా దృశ్యం 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. వెంకీ-మీనా ప్రధాన పాత్రల్లోనే ఈరీమేక్ కూడా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తేలిసిందే. ఈనేపథ్యంలో ఈసినిమా హిందీ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. దృశ్యం 2 హిందీ రైట్స్ ను పనోరమ స్టూడియోస్ వారు దక్కించుకున్నారు. ఈవిషయాన్ని అధికారికంగా తెలిపారు.
దృశ్యం మొదటి పార్ట్ హిందీ వర్షన్ లో అజయ్ దేవగన్ మరియు శ్రియ శరన్ లు జంటగా నటించారు.ఒరిజినల్ వర్షన్ కు చాలా మార్పులు చేర్పులు చేసి హిందీ దృశ్యం 2 ను తెరకెక్కించడం జరిగింది. హిందీ లో అవే మార్పుల తో దృశ్యం 2 ను కూడా తెరకెక్కిస్తారనే వార్తలు వస్తున్నాయి.అయితే అజయ్ దేవగన్ రీమేక్ లో నటించేందుకు ఓకే చెప్పాడా లేదంటే మరో హీరో ఎవరైనా దృశ్యం 2 ను చేస్తారా అనేది చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: