తమిళ హీరోయిన్ రెజీనా “శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను రెజీనా ఆకట్టుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “మూవీ లో రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న రెజీనా ఒక కొరియన్ మూవీ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సురేష్ ప్రొడక్షన్స్ , గురు ఫిల్మ్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ కొరియన్ మూవీ “మిడ్ నైట్ రన్నర్స్ “కు తెలుగు రీమేక్ మూవీ రూపొందనుంది. రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేద థామస్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీ కి టైటిల్ గా “శాకిని ఢాకిని” ని నిర్ణయించినట్టు సమాచారం. ఇంతకు ముందు ఇవే బ్యానర్స్ పై రూపొందిన కొరియన్ మూవీ తెలుగు రీమేక్ “ఓ బేబీ “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: