‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ ‘అఖండ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఈమధ్యనే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టగా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. అయితే రీసెంట్ గా ‘అఖండ’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయగా సంచలనాలు రేపుతుంది. ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ వీడియో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే అదే రోజు ‘అఖండ’ ట్రైలర్కు ముహూర్తం పెట్టారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తల్ని నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి ఖండించారు. ‘‘ప్రస్తుత పరిస్థితులు సినిమా విడుదలకు అనుకూలంగా లేవు. ఇలాంటి సమయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేము. అందుకే 15 రోజుల్లో షెడ్యూల్లో రెండు పాటలు, ఓ క్లైమాక్స్ ఫైట్ ఉన్నప్పటికీ షూటింగ్ ఆపేశాము. పరిస్థితులు ఎప్పటికి సాధారణ స్థితికి వస్తాయో ఎవరికీ తెలీదు. అంతా సర్దుకున్నాక షూటింగ్ మొదలుపెడతాం. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఈ నెల 28న విడుదల చేయడం లేదు. ట్రైలర్ బయటికొస్తే సినిమా మీద అంచనాలు పెరుగుతాయి. ప్రస్తుతం బయట పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కాబట్టి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక ట్రైలర్ విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు.
ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నాడట. వాటిలో రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: